unfoldingWord 46 - పౌలు క్రైస్తవుడిగా మారడం
Grandes lignes: Acts 8:1-3; 9:1-31; 11:19-26; 13-14
Numéro de texte: 1246
Langue: Telugu
Audience: General
Genre: Bible Stories & Teac
Objectif: Evangelism; Teaching
Citation biblique: Paraphrase
Statut: Approved
Les scripts sont des directives de base pour la traduction et l'enregistrement dans d'autres langues. Ils doivent être adaptés si nécessaire afin de les rendre compréhensibles et pertinents pour chaque culture et langue différente. Certains termes et concepts utilisés peuvent nécessiter plus d'explications ou même être remplacés ou complètement omis.
Corps du texte
సౌలు అనే ఒక వ్యక్తి ఉండేవాడు, అతడు యేసు నందు విశ్వాసం ఉంచలేదు. అతడు యువకునిగా ఉన్నప్పుడు, స్తెఫనును చంపినవారి వస్త్రాలకు కావలి ఉన్నాడు. తరువాత విశ్వాసులను హింసించాడు. యెరూషలెంలో ఇంటి ఇంటికి వెళ్లి స్త్రీ పురుషులను బంధించి వారిని చెరసాలలో వేస్తున్నాడు. అప్పుడు ప్రధాన యాజకులు దమస్కు అనే పట్టణానికి వెళ్ళడానికి సౌలుకు అనుమతి ఇచ్చారు. అక్కడ క్రైస్తవులను బంధించి వారిని యెరూషలెంకు తీసుకొని రావాలని చెప్పాడు.
కనుక సౌలు దమస్కు వెళ్ళడం ప్రారంభించాడు. ఆ పట్టణానికి చేరుతున్నప్పుడు ఆకాశంనుండి ప్రకాశమైన వెలుగు అతని చుట్టూ వెలిగింది. సౌలు కింద పడిపోయాడు. అప్పుడు సౌలు ఒక స్వరాన్ని విన్నాడు, “సౌలా! సౌలా! నీవేల నన్ను హింసించుచున్నవు?” అందుకు సౌలు, “ప్రభువా నీవు ఎవరవు?” అని ప్రభువును అడిగాడు. యేసు ఇలా జవాబిచ్చాడు, “నీవు హింసించుచున్న యేసును!”
సౌలు పైకి లేచినపుడు, తాను ఎవరినీ చూడలేకపోయాడు. అతని స్నేహితులు అతనిని దమస్కులోనికి నడిపించారు. సౌలు మూడు రోజులు ఏమియూ తినకనూ, ఏమియూ తాగకయూ ఉన్నాడు.
దమస్కులో అననియ అనే ప్రభువు శిష్యుడు ఉన్నాడు. దేవుడు అననియతో, “సౌలు ఉన్న ఇంటికి వెళ్ళుము, అతడు తిరిగి చూపు పొందునట్లు అతని మీద చేతులుంచి ప్రార్థన చెయ్యి” అని చెప్పాడు. అయితే అననియ దేవునితో ఇలా చెప్పాడు, “ప్రభూ ఈ మనిషి విశ్వాసులను హింసించాడని నేను విన్నాను.” అందుకు దేవుడు, “నీవు వెళ్ళుము, ఇతడు యూదులకునూ, ఇతర ప్రజలకునూ నా నామమును ప్రకటించడానికి నేను ఎన్నుకొన్న నా సాధనం. నా నామము నిమిత్తం అనేక శ్రమలను భరిస్తాడు.”
కనుక అననియ సౌలు వద్దకు వెళ్ళాడు. అతని మీద చేతులుంచాడు. ఇలా చెప్పాడు, “నీ మార్గంలో నీకు కనిపించిన ప్రభువైన యేసు నీవు చూపు పొందేలా నన్ను నీ వద్దకు పంపాడు, పరిశుద్దాత్ముడు నిన్ను నింపుతాడు.” వెంటనె సౌలు చూపు పొందాడు. అప్పుడు అననియ సౌలుకు బాప్తిస్మం ఇచ్చాడు. అప్పుడు సౌలు ఆహారాన్ని తీసుకొన్నాడు, తిరిగి బలాన్ని పొందాడు.
వెంటనే సౌలు దమస్కులోని యూదులకు బోధించడం ఆరంభించాడు. సౌలు ఇలా బోధించాడు, “యేసు దేవుని కుమారుడు!” యూదులు ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే సౌలు విశ్వాసులను చంపడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు యేసు నందు విశ్వాసం ఉంచాడు! సౌలు యూదులతో వాదించాడు. యేసు మెస్సీయ అని వారికి చూపించాడు.
అనేక సంవత్సరాల తరువాత, యూదులు సౌలును చంపాలని ప్రణాళిక వేసారు. పట్టణ ద్వారాల వద్ద అతనిని పట్టుకొని చంపాలని కోవాలని వారు కొందరిని పంపారు. అయితే సౌలు ఈ పన్నాగాన్ని గురించి విన్నాడు, సౌలు తప్పించుకోడానికి అతని స్నేహితులు సౌలుకు సహాయం చేసారు. ఒక రాత్రి పట్టణ ప్రాకారం నుండి ఒక బుట్టలో ఉంచి తాళ్ళతో అతనిని దించివేసారు. సౌలు దమస్కు నుండి తప్పించుకొన్న తరువాత యేసును గురించి ప్రకటించడం కొనసాగించాడు.
సౌలు అపొస్తలులను కలుసుకోడానికి యెరూషలెం వెళ్ళాడు. అయితే వారు సౌలును గురించి భయపడ్డారు. అప్పుడు బర్నబా అను ఒక విశ్వాసి సౌలును అపొస్తలుల వద్దకు తీసుకొని వెళ్ళాడు. దమస్కులో సౌలు ధైర్యంగా బోధించాడని వారికి చెప్పాడు. దాని తరువాత అపొస్తలులు సౌలును అంగీకరించారు.
యెరూషలెంలో శ్రమలను బట్టి చెదరిపోయిన కొందరు విశ్వాసులు దూరంలో ఉన్న అంతియొకయ పట్టణానికి పారిపోయారు. అక్కడ యేసును గురించి బోధించారు. అంతియొకయలో ఉన్న వారు యూదులు కాదు. అయితే మొట్టమొదటిసారి వారిలో అనేకులు విశ్వాసులు అయ్యారు. బర్నబా, సౌలు అక్కడ నూతన విశ్వాసులకు యేసును గురించి బోధించారు, సంఘాన్ని బలపరచారు. అతియొకయలో ఉన్న యేసు విశ్వాసులు మొట్టమొదట “క్రైస్తవులుగా” పిలువబడ్డారు.
ఒక రోజును, అంతియొకయలోని క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు వారితో ఇలా చెప్పాడు, “నేను పిలిచిన పని చెయ్యడానికి నా కొరకు బర్నబానూ, సౌలునూ ప్రత్యేక పరచండి.” కనుక అంతియొకయలోని సంఘం వారి మీద చేతులుంచారు. అప్పుడు వారు బర్నబానూ, సౌలునూ అనేక ఇతర ప్రాంతాలకు పంపారు. బర్నబా, సౌలు అనేక ఇతర ప్రజా గుంపులకు బోధించారు. అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు.