unfoldingWord 30 - ప్రభువైన యేసు ఐదు వేలమందికి ఆహారం పెట్టడ్డం
![unfoldingWord 30 - ప్రభువైన యేసు ఐదు వేలమందికి ఆహారం పెట్టడ్డం](https://static.globalrecordings.net/300x200/z42_Lk_09_12.jpg)
रूपरेखा: Matthew 14:13-21; Mark 6:31-44; Luke 9:10-17; John 6:5-15
लिपि नम्बर: 1230
भाषा: Telugu
दर्शक: General
उद्देश्य: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
स्थिति: Approved
लिपिहरू अन्य भाषाहरूमा अनुवाद र रेकर्डिङका लागि आधारभूत दिशानिर्देशहरू हुन्। तिनीहरूलाई प्रत्येक फरक संस्कृति र भाषाको लागि बुझ्न योग्य र सान्दर्भिक बनाउन आवश्यक रूपमा अनुकूलित हुनुपर्छ। प्रयोग गरिएका केही सर्तहरू र अवधारणाहरूलाई थप व्याख्याको आवश्यकता हुन सक्छ वा पूर्ण रूपमा प्रतिस्थापन वा मेटाउन पनि सकिन्छ।
लिपि पाठ
![](https://static.globalrecordings.net/300x200/z40_Mt_14_11.jpg)
ప్రభువైన యేసు తన శిష్యులను సువార్త ప్రకటించడానికీ, దేవుని వాక్యాన్ని బోధించడానికీ యేసు తన అపొస్తలులను అనేక గ్రామాలకు పంపాడు. వారు యేసు ఉన్న చోటకు తిరిగివచ్చినప్పుడు, వారు చేసినదాన్నంతటిని యేసుతో చెప్పారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోడానికి సరస్సు అవతలి వైపుకు వెళ్ళమని ప్రభువు వారితో చెప్పాడు. అందువల్ల, వారు ఒక పదవ ఎక్కి సరస్సుకు ఆవలి వైపుకు వెళ్లారు.
![](https://static.globalrecordings.net/300x200/z40_Mt_14_12.jpg)
అయితే అనేకులు యేసునూ, ఆయన శిష్యులనూ పడవలో ఉండడం చూచారు. ఈ ప్రజలు సరస్సు ఒడ్డునుండి నది ఆవలి వైపుకు పరుగెత్తి వారికి ముందుగా వెళ్ళారు. కాబట్టి యేసు, ఆయన శిష్యులు వచ్చినప్పుడు, ఒక పెద్ద సమూహం అక్కడ అప్పటికే ఉంది, వారు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
![](https://static.globalrecordings.net/300x200/z42_Lk_09_01.jpg)
ఈ గుంపులో 5,000 మందికి పైగా పురుషులు ఉన్నారు, మహిళలు, పిల్లలను లెక్కించలేదు. ప్రభువు వారిపై కనికరపడ్డాడు. ప్రజలు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నారని ప్రభువుకు కనిపించింది. కనుక ఆయన వారికి బోధించి, వారిలో వ్యాధులతో ఉన్నవారిని స్వస్థపరిచాడు.
![](https://static.globalrecordings.net/300x200/z42_Lk_09_08.jpg)
తరువాత ఆయన శిష్యులు ప్రభువుతో ఇలా చెప్పారు, “ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, సమీపంలో ఎటువంటి పట్టణాలూ లేవు. వారు ఏమైనా భుజించుటకు వారిని పంపించివెయ్యి.”
![](https://static.globalrecordings.net/300x200/z42_Lk_09_09.jpg)
అయితే యేసు తన శిష్యులతో, "వారు తినడానికి మీరే ఏదైనా ఇవ్వండి అన్నాడు. వారు "మా వద్ద ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి అన్నారు.
![](https://static.globalrecordings.net/300x200/z42_Lk_09_11.jpg)
యేసు తన శిష్యులతో, ప్రజలందరూ నేలపై గడ్డి మీద ఒక్కొక్క గుంపులో యాభై మంది చొప్పుల కూర్చుండాలని చెప్పాడు.
![](https://static.globalrecordings.net/300x200/z42_Lk_09_12.jpg)
అప్పుడు యేసు ఐదు రొట్టెలు, రెండు చేపలను తీసుకొని ఆకాశం వైపుకు కన్నులెత్తి చూసి ఆ ఆహారం కోసం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు.
![](https://static.globalrecordings.net/300x200/z42_Lk_09_13.jpg)
అప్పుడు యేసు ఆ రొట్టెలనూ, చేపలనూ విరిచి ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ఆహారాన్ని ప్రజలందరికీ పంచిపెట్టారు. అవి తరిగి పోలేదు. ప్రజలంతా తిని, సంతృప్తి చెందారు.
![](https://static.globalrecordings.net/300x200/z42_Lk_09_14.jpg)
ఆ తరువాత, శిష్యులు మిగిలిన ఆహారాన్ని సేకరించారు. అది పన్నెండు గంపలు అయ్యింది. ఆ ఆహారం అంతా ఐదు రొట్టెలు, రెండు చేపల నుండి వచ్చింది.